13 డిసెం, 2008

నేరము-శిక్ష

ఒక ఆటవిక సంస్కృతికి - ఒక ఆటవిక న్యాయం తోనే వరంగల్ పోలీసులు సమాధానం చెప్పారు. యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్ ఎలుకలు దూరాయని చూరుకు నిప్పంటించుకోవటమే . ఈ ఎన్ కౌంటర్ సామాన్యుడికి చట్టాలపై గౌరవం, నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. పోలీసులు, ప్రబుత్వమే చట్టాలను ఉల్లంఘించి హత్యలకు పాల్పడటం ఏ నాగరిక సమాజం సహించదు. ఇంజనీరింగ్ విద్యార్ధినులు స్వప్నిక, ప్రణీత పై యాసిడ్ దాడిని సబ్యసమాజం ముక్తఖంఠం తో ఖండించింది. నిందితులకు మరణశిక్ష పడాలని కోరు కునేవాడిలో నేను ఒకడిని. (అమలు రాష్ట్రపతి నిర్ణయం). ప్రజలు కోరు కుంటున్నారని నిందితులను ఈ రకంగా హత్యచేయటం చట్టం తన పరిది దాటి పని చేయటమే. ఈ ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు ప్రజలకు ఏం చెప్ప దల్చు కున్నారు. మున్ముందు ఎవరు ఇలా చేయరనా.. అలాగైతే ఉరిశిక్ష తర్వాత ఇలాంటి సంఘటనలు జరగకూడదు గదా .. అప్పుడే వరంగల్ లో మరో సంఘటణ జరిగింది..అతడిని కూడా చంపుతారా.. ప్రత్యూష, అయేష మీరా కేసులలో రాజకీయ నాయకుల వారసులను ఎందుకు చంపలేదు..నాయకులు డబ్బున్నవారు ఏం చేసిన చెల్లుభాటు అవుతుంధా ? వరంగల్ పోలీసులకు ఇది కొత్త కాదు. మనీషా నిందితులను ఇలానే చేశారు. తప్పు చేసిన పోలీసులను హీరోలుగా చూస్తున్నారు.ప్రజలు ఇలా ప్రోత్సహిస్తే వారు ఇలాంటి ఎన్ కౌంటర్ లు ఎన్నైనా చేయగలరు. పోలీసులే శిక్షలు అమలు చేస్తే ఇక న్యాయస్థానాలు, ప్రబుత్వాలు, జైళ్ళు ఎందుకు.. అరభ్ దేశాల మాదిరిగా శిక్షకు శిక్ష కావాలని ప్రజలు కోరుకుంటే ప్రబుత్వం ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఆ విధమైన చట్టాలు అమలు చేయ వచ్చుగా.. ఈ రోజు ఈ ఘటనను సమర్దిస్తే ..దీనిని సాకుగా తీసుకుని పోలీసులురేపు అమాయకులను చంపితే ఎవరు భాద్యత వహిస్తారు.. పోలీసులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల ఆవేశాన్ని చల్లార్చడానికి ,ఎన్నికల ముందు ప్రబుత్వం ఈ న్యూసెన్స్ బరించలేకే ఈ దురాఘతానికి ఒడిఘట్టాయి. చత్త బద్దంగా చేయాల్సిన పనిని ఆటవికంగా చేశారు. అర్ధరాత్రి దొడ్డి దారి లో చంపకుండా పబ్లిక్ లో వాళ్ళను శిక్షిస్తే పోలీస్ శాఖ విశ్వసనీయత పెరిగేది. వరసగా సంఘటణలు జరగటం, నిందితులకు శిక్షల ఖరారులో విపరీత జాప్యం జరిగి నేరస్తులు తప్పించుకోవటం ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది. ఆత్యా చారాలు, ర్యాగింగ్, మహిళ పై దాడులు వంటి కేసుల్లో కటిన శిక్షలు లేకపోవటం ,ప్రాసికౄషన్ బలంగా ఉండక పోవటం, , పోలీసు శాఖ పని తీరు సరిగా లేకపోవటం నిందితులు తప్పించుకోవటానికి కారణాలు. పోలీసుల నిర్వాకం వల్ల ఐ దు కుటుంభాలకు తీరని శోకం మిగిలింది. మిత్రునికి సహకరించిన ఇద్ద్దరు యువకులు బలయ్యారు. మానవ సంబంధాలు, యువత పెడదోరణులు ,వేష ధారణ పై చర్చ జరగాలి. వ్యవస్తలో వస్తున్న మార్పులకు అబ్బాయిలే కాదు అమ్మాయిలకు బాద్యత ఉంది. హోం మినిష్టర్ గారూ.. చట్టం తనపని తాను చేసుకు పోవటమే కాదు .. న్యాయం పనికూడా చేస్తుందిసార్..

3 కామెంట్‌లు:

  1. బాగ చేప్పరు.. డబ్బులున్న నాయకల కొడులని కూడ ఎన్ కౌంటర్ చేస్తే అప్పుడు, పోలిస్ ల ని అభినదిస్తాం

    రిప్లయితొలగించండి
  2. బాగ చేప్పరు.. డబ్బులున్న నాయకల కొడులని కూడ ఎన్ కౌంటర్ చేస్తే అప్పుడు, పోలిస్ ల ని అభినదిస్తాం..

    రిప్లయితొలగించండి